ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. కేసు విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇందుకు తాము బాధ్యులం కాదని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పగా.. ఎవరు బాధ్యత వహిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణను ఏప్రిల్ తొలిభాగంలో చేపట్టనున్నట్లు ప్రకటించింది.