తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవటంతో వెలుపల వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల నుంచి 30 గంటల వరకు సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక శుక్రవారం శ్రీవారిని 67,873 భక్తులు దర్శించుకోగా, 33,532 మంది తలనీలాలు సమర్పించారు. రూ. 3.93 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది.