డ్రగ్స్, మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన కుటుంబాన్ని దారుణంగా హత్య చేశాడు. యూపీలోని సీతాపూర్ జిల్లా పల్హాపూర్కి చెందిన అనురాగ్ సింగ్ను డీ అడిక్షన్ సెంటర్కు పంపాలని కుటుంబ సభ్యులు భావించారు. దీంతో గొడవపడి 65 ఏళ్ల తల్లి సావిత్రిని గన్తో కాల్చి, భార్య ప్రియాంక(40) తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. ముగ్గురు పిల్లలు అశ్విని(12), ఆర్నా(9), అద్విక్(6)లను మేడ పైనుంచి కిందకు విసిరేశాడు. తర్వాత తాను గన్తో కాల్చుకుని మరణించాడు.