18వ లోక్సభ సమావేశాలు నేటి ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో విజయనగరం ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పల నాయుడు తొలిరోజే అందరినీ ఆకట్టుకున్నాడు. వినూత్నంగా ఆయన తెలుగుదేశం పార్టీ గుర్తు అయిన సైకిల్పై వెళ్లారు. ఢిల్లీలోని తన అతిథి గృహం నుంచి పార్లమెంట్ వరకు సైకిల్పై చేరుకున్నారు. సైకిల్ ముందు భాగాన ‘సైకిల్ గుర్తుపై ఎంపీగా గెలిచిన విజయనగరం ఎంపీ మొదటి రోజు పార్లమెంట్లో అడుగు పెడుతున్న వేళ..’ అంటూ రాసుకున్నారు.