ఆప్ నేత సంజయ్ సింగ్ ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి నేతృత్వంలో మరో ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించాలని ఆయన ఖర్గేను కోరారు. సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష నాయకుడైన ఖర్గే మాకు మద్దతుగా ఉన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఖర్గే మద్దతు కోరాను’ అని తెలిపారు.