కాంగ్రెస్ మీటింగ్ పై మహిళల ఆరోపణలు

ఆదివారం రోజు ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఈ సభకు హాజరయ్యారు. ఈ సభకు లక్షలాది మంది ప్రజలను తరలించారు. అయితే, సభకు తీసుకువచ్చి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని పలువురు మహిళలు ఆరోపించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. రూ. 200 ఇస్తామని పిలిచి 100 మాత్రమే ఇచ్చారని వారు వాపోయారు. ఈ వీడియోను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు షేర్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్