AAP రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన కేసుపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. బిభవ్ బెయిల్ పిటిషన్పై స్పందించాలని ఢిల్లీ పోలీసులను హైకోర్టు కోరింది. జస్టిస్ అమిత్ శర్మతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ బెయిల్ పిటిషన్పై పోలీసులకు నోటీసు జారీ చేసింది. స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరింది. మే 13న స్వాతి మలివాల్పై బిభవ్ దాడి చేశారు.