ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని మహోబాలో ఉన్న HDFC బ్రాంచ్లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న రాజేష్ కుమార్ షిండే గుండెపోటుతో మరణించాడు. ఈ మేరకు ఆఫీస్ లో ల్యాప్ట్యాప్లో పని చేసుకుంటుండగా సడన్గా కుర్చీలోనే కుప్పకూలాడు. అప్రమత్తమైన తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు బ్యాంక్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.