బెంగళూరు వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విరాట్ ఫీల్డ్లో అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఈ మేరకు సుందర్ వేసిన బంతిని అఫ్గాన్ బ్యాటర్ కరీమ్ జనత్ భారీ షాట్ కొట్టాడు. లాంగాన్లో ఉన్న కోహ్లీ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో ఆ బంతిని పట్టి బౌండరీ ముందుకు విసిరాడు. దీంతో 5 పరుగులు సేవ్ అయ్యాయి. ఈ ప్రదర్శనకు గాను కోహ్లీకి ‘ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు వరించింది.