పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర హైకోర్టు బిగ్ షాకిచ్చింది. 2010 తరువాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉప కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని పేర్కొంది. ఈ నిర్ణయంపై మమతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సామాజిక వర్గాలను ఓబీసీ జాబితా నుంచి తొలగించేలా వారు (బీజేపీ) ఈ ఆర్డర్ ఇచ్చారని ఆరోపించారు. ఓబీసీ రిజర్వేషన్ కొనసాగుతుందన్నారు.