మెదక్ జిల్లాలో జిల్లాలో దారుణం జరిగింది. నవాబ్పేటకు చెందిన పోతరాజు ఉదయ్కు అదే కాలనీకి చెందిన భవానీ ప్రేమించుకున్నారు. వీరి పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేకపోవడంతో హైదరాబాద్ కు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి సోదరుడు అంజిత్ కోపోద్రిక్తుడయ్యాడు. క్షణికావేశంలో తన చెల్లిని వివాహమాడిన యువకుడి ఇంటికి వెళ్లి అతడి సోదరుడు నగేశ్ (25)ను కిరాతకంగా హతమరార్చాడు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదైంది.