రియల్ ఎస్టేట్ రంగం రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ప్రముఖ రియల్టీ సంస్థ ‘క్రిసుమి కార్పొరేషన్’ కీలక నిర్ణయం తీసుకుంది. విస్తరణ ప్రణాళికలో భాగంగా గురుగ్రామ్లో 1,051 లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మించడానికి రూ. 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. జపాన్కు చెందిన సుమిటోమో కార్పొరేషన్తో కలిసి నిర్మాణాలు చేపట్టనుంది.