కాసేపటి క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం జగన్ మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమిపై మాట్లాడుతూ బావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు ఆపుకుంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇవాళ వెల్లడైన ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నామని, పడిన చోట నుంచే గుండె ధైర్యంతో మళ్లీ లేస్తామని చెప్పారు. తోడుగా ఉన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.