బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పేరును ప్రస్తావిస్తూ.. ప్రజల ఇక్కట్లను కేంద్రం దృష్టికి కాంగ్రెస్ తీసుకెళ్లింది. 'అమితాబ్ బచ్చన్జీ.. మీనుంచి మాకో సహాయం కావాలి. కోట్లాది మంది సామాన్య ప్రజలు రైళ్లలో ఈ విధంగా ప్రయాణించాల్సి వస్తోంది' అంటూ రైలులో రద్దీకి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. సెలబ్రిటీలు ప్రజా సమస్యలను లేవనెత్తితే.. కేంద్రం వెంటనే స్పందిస్తోందని, అందుకే అమితాబ్ పేరును ప్రస్తావించినట్లు పేర్కొంది.