ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించిన తర్వాత ధోనీ తన స్వస్థలం రాంచీకి చేరుకున్నాడు. కూల్గా తన బైక్తో రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కాడు. ఓవైపు ఐపీఎల్కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొందరు.. వచ్చే ఏడాది కూడా ఆడతాడని మరికొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటుండగా.. మిస్టర్ కూల్ మాత్రం బైక్పై రాంచీ వీధుల్లో షికారు చేయడం విశేషం.