ఏపీ టెట్ ఫలితాల్లో క్వాలిఫై అయిన వారికి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ టెట్లో అర్హత సాధించని వారు నిరాశకు గురికావొద్దని విజ్ఞప్తి చేశారు. వీరంతా.. కొత్తగా బీఈడీ, డీఎడ్ పాసైన అభ్యర్థులతో పాటు అతి త్వరలోనే నిర్వహించబోయే టెట్కు, మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని లోకేశ్ సూచించారు.