ఈ రాష్ట్రాల్లో రేపే ఎన్నిక‌ల కౌంటింగ్

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో రేపే ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ 2 రాష్ట్రాల్లోని ప్రభుత్వాల పదవీకాలం జూన్ 2తో ముగియనుంది. దీంతో అరుణాచల్‌లోని 60, సిక్కింలోని 32 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు రేపే వెల్ల‌డికానున్నాయి. అరుణాచ‌ల్‌లో బీజేపీ 60 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను బ‌రిలో దింప‌గా.. 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందారు. కాంగ్రెస్ 19 స్థానాల్లో పోటీ చేస్తోంది. సిక్కింలో SKM, SDF మ‌ధ్య పోటీ ఉంది.

సంబంధిత పోస్ట్