ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీరభ్కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం సీఎస్గా నీరభ్కుమార్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.