ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్లో తాజాగా విషాదకర ఘటన జరిగింది. జిరాన్ గ్రామానికి చెందిన బేగరాజ్ సింగ్ (55) అనే రైతు చెరుకు తోటలో పని చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.