ఉత్తరప్రదేశ్ లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఠాకూర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘైలాపుల్ సమీపంలో జరిగింది.