కరీంనగర్ సుభాష్నగర్లోని గాయత్రి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆసుపత్రి ఐసీయూలోని ఏసీల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఐసీయూలోని రోగులను ఆసుపత్రి సిబ్బంది బయటకు తరలించారు.ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.