భారత మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ గురువారం కన్నుమూశారు. కర్ణాటకలోని హాసన్ జిల్లా అరసీకెరె ప్రాంతానికి చెందిన ఆయన అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను క్రిసెంట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. భారత్ తరుపున ఆయన 2 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.