రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు గతేడాది ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభం కాగా.. 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఉదయం 9 గంటలకే ప్రారంభించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలను తిరిగి ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా.. ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయి. హైదరాబాద్, సికింద్రాబాద్లో మాత్రం ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే నడుపుతారు.