చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘‘జీఎస్టీ సమావేశం ఆగస్టు చివరి వారం మళ్లీ నిర్వహిస్తాం. పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నాం. జీఎస్టీ సెక్షన్ 73 కింద డిమాండ్ నోటీసులు ఇచ్చాం. వచ్చే ఏడాది మార్చిలోగా పన్ను కట్టేవారికి మినహాయింపులు ఇస్తాం. జీఎస్టీ కట్టేందుకు చివరితేదీ గడువు పొడిగించాం’’ అని తెలిపారు.