ఢిల్లీలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 11 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మొన్నటి వరకూ భానుడి తాపంతో ఉక్కిరి బిక్కిరి అయిన ఢిల్లీ ప్రజలు వర్షాల ధాటికి వణికిపోతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని జీవనం గడుపుతున్నారు. దీంతో అండర్పాస్లు నీటిలో మునిగాయి. అందులో చిక్కుకున్న ఇద్దరు బాలురు మరణించగా.. ఓఖ్లాలో, నీటమునిగిన అండర్పాస్లో 60 ఏళ్ల వ్యక్తి మరణించాడు.