గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జమ్మూకశ్మీర్ను అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో ముగ్గురు చిన్నారులు సహా నలుగురు చనిపోయారు. మరోవైపు వరదల్లో చిక్కుకున్న 350కి పైగా కుటుంబాలను తరలించారు. కశ్మీర్ విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఆకస్మిక వరదలకు అనేక పశువులు, నాలుగు డజన్ల గొర్రెలు చనిపోయాయి.