లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని ఆదివారం రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ ఆలయ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. బోనాల అనంతరం ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.