రాష్ట్రంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ పాలన జరుగుతుంది

రాష్ట్రంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ పాలన జరుగుతుందని మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా సర్వే నామినేషన్ దాఖలు చేశారు. అసలైన కాంగ్రెస్ వాదులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అవేదన వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ బి ఫామ్ ఇస్తే కాంగ్రెస్ తరపున పోటీ చేస్తానని లేని పక్షంలో కాంగ్రెస్ రెబల్ గా బరిలో ఉంటానన్నారు.

సంబంధిత పోస్ట్