పింక్ ప్రామీస్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రాష్ట్ర ప్రజలకు రెండు ఆఫర్లు అందించనుంది. మహిళల సాధికారిత, అభ్యున్నత లక్ష్యంగా.. ఇవాళ మ్యాచ్కు అమ్ముడైన ప్రతి టికెట్పై రూ.100ను రాయల్ రాజస్థాన్ ఫౌండేషన్కు ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని మహిళల కోసం ఖర్చు చేయనున్నారు. అంతేగాక ఇవాళ మ్యాచ్లో నమోదైన ప్రతి సిక్సర్కు ఆరు ఇళ్లకు చొప్పున ఫ్రీ సోలార్ పవర్ కనెక్షన్ ఇవ్వనుంది.