ఏపీలో పెన్షన్లపై దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పెంచిన పెన్షన్లను జులై 1న లబ్ధిదారులకు అందజేస్తామని వెల్లడించారు. 65 లక్షల పేద కుటుంబాలకు మేలు జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారన్నారు. రూ.3 వేల పెన్షన్ను రూ.4 వేలకు చంద్రబాబు పెంచారని వెల్లడించారు. అంతేగాక మూడు నెలల బకాయిలు కలిపి రూ.7 వేల చొప్పున ఇస్తామన్నారు.