కేంద్రం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్'తో దేశ యువతకు అన్యాయం జరుగుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం లేఖ రాశారు. 'అగ్నిపథ్' తీసుకొచ్చి సైనిక దళాల్లో శాశ్వత నియామకాలను కేంద్రం నిలిపి వేసిందన్నారు. 'అగ్నిపథ్'తో కేవలం నాలుగేళ్లు మాత్రమే ఉపాధి ఉంటుందన్నారు. దీంతో యువత భవిష్యత్తును కేంద్రం ప్రశ్నార్థకంగా మార్చిందన్నారు.