ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దాఖలు చేసిన ఏడో అనుబంధ చార్జిషీట్ను సీబీఐ ప్రత్యేక కోర్టు విచారించింది. కవితతో సహా ఐదుగురు నిందితులపై వేసిన చార్జిషీట్ పరిశీలనపై ఈ నెల 29న తుది ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయమూర్తి కావేరీ బవేజా తెలిపారు. మరోవైపు కేజ్రీవాల్పై దాఖలైన అనుబంధ చార్జిషీట్పై 28న వాదనలు ప్రారంభం కానున్నాయి.