హమాస్తో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో భాగంగా ఇజ్రాయెల్ పాలస్తీనాను లక్ష్యంగా చేసుకుంది. తాజాగా వెస్ట్ బ్యాంక్లోని శరణార్థి శిబిరంపై నూర్ అల్- షామ్స్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడి జరిపింది. ఈ దాడిలో 14 మంది మృతి చెందారు. శిబిరంలో ఉన్న మరికొంతమందికి గాయాలయ్యాయి. ఇది కాక, శనివారం దక్షిణాన గాజా నగరంలో ఒక ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తొమ్మిది మంది మరణించారు.