టీపీసీసీ పదవిపై ఆ పార్టీ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవిని అడిగే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటుందని అన్నారు. బీజేపీలో ఆ అవకాశం ఉండదని చెప్పారు. ఇక బీఆర్ఎస్లో అయితే మరొకరికి అవకాశమే రాదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ధైర్యంగా పదవిని అడగొచ్చని వెల్లడించారు.