కాళేశ్వరం గురించి మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడేందుకు సిగ్గుపడాలని ఉత్తమ్ కుమార్రెడ్డి ఫైర్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 'బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్ట్.. వారి హయంలోనే కూలిపోయింది. ఒక్క పిల్లరే కదా కుంగింది అని కేసీఆర్ అన్నారు. అమెరికాలో బ్యారేజీ కుంగలేదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం కోసం విద్యుత్ ఖర్చే ఏడాదికి రూ.10 వేల కోట్లు అవుతుంది' అన్నారు.