ఐపీఎల్-2024 సీజన్కు చెన్నై సూపర్ కింగ్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ను ఎంపిక చేసింది. కాగా ఇటీవలే సీఎస్కే స్పాన్సర్గా ఇతిహాద్ ఎయిర్వేస్ నియామకం అయిన సంగతి తెలిసిందే. ఇక కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.