సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు గెలిచిన కేసీఆర్.. ఇప్పటివరకు గజ్వేల్ కు రాలేదని బీజేపీ నాయకులు అగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ పట్టణంలో పలు చొట్ల 'కేసీఆర్ కనబడడం లేదు' అని పోస్టర్స్ వేసి ర్యాలీ చేశారు. 'గజ్వేల్ ప్రజలు ఇక్కడ.. కేసీఆర్ ఎక్కడ' అని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు.