ఖమ్మం జిల్లా రఘునాథపల్లిలో తల్లీపిల్లల మృతిపై అనుమానాలు వీడటం లేదు. కారు చెట్టును ఢీకొని తల్లి కుమారితో పాటు పిల్లలు కృషిక, తనిష్క మృతిచెందారు. అయితే.. డ్రైవింగ్ చేస్తున్న భర్త ప్రవీణ్ శరీరంపై గాయాలున్నప్పటికీ.. తల్లీపిల్లల ఒంటిపై గాయాలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో ప్రవీణే.. వారిని చంపి, యాక్సిడెంట్ అంటూ డ్రామాలాడుతున్నాడని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.