లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ జట్టుకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు జరగనున్న ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచ్కు రాహుల్ దూరం కానున్నట్లు సమాచారం. ఢిల్లీ వెళ్లిన జట్టు సభ్యుల్లో ఆయన కనిపించకపోవడమే ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. హైదరాబాద్తో ఓటమి తర్వాత లక్నో జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా డగౌట్ వద్ద రాహుల్పై సీరియస్ అయిన విషయం తెలిసిందే.