కోల్కతా హ్యాట్రిక్ విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కోల్కతా 106 పరుగుల భారీ తేడాతో మరపురాని విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు. 273 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ 17.2 ఓవర్లకు 166 పరుగులకు ఆలౌటైంది. పంత్ 55, స్టబ్స్ 54 రాణించారు.