వైసీపీ అధినేత వైఎస్ జగన్పై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ప్రజలు తనను మోసం చేశారని చెప్పడం జగన్ పెత్తందారీతనానికి నిదర్శనం అన్నారు. తన చేతగాని తనాన్ని ప్రజల మీదికి నెట్టేసిన ఏకైక సీఎం జగన్ అంటూ విమర్శించారు. ఈ ఎన్నికల్లో తీర్పు.. 5 కోట్ల ఆంధ్రుల సమష్టి విజయంగా అభివర్ణించారు. నియంతృత్వ పాలనను ప్రజలు అధఃపాతాళానికి తొక్కేశారని పేర్కొన్నారు.