యాదాద్రి తరహాలోనే శ్రీశైలంలో కూడా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అయ్యన్న దేవస్థానం చెక్పోస్టు వద్ద అధికారులు ప్లాస్టిక్ బాటిళ్లను, చెత్త చెదారాన్ని తీసివేసి శుభ్రపరిచారు. అలాగే వివిధ వాహనాలను తనిఖీ చేసి ప్లాస్టిక్ బాటిళ్లను క్షేత్ర పరిధిలోకి తీసుకురాకుండా తనిఖీలు నిర్వహించారు.