ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT)లో ఓ లోకల్ ట్రైన్ సోమవారం ఉదయం పట్టాలు తప్పింది. ప్లాట్ఫారమ్ 2లోకి ప్రవేశిస్తుండగా పన్వెల్-CSMT లోకల్ రైలు ఉదయం 11.35 గంటలకు ఊహించని ప్రమాదానికి గురైంది. మోటర్మ్యాన్ నుండి రెండవ కోచ్ పట్టాలు తప్పింది. CSMT-వడాల మధ్య హార్బర్ లైన్లో రైలు సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.