మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. ఈ మేరకు రెండు దేశాల మధ్య సంత్సంబంధాలపై ఇరువురూ చర్చించుకున్నట్లు తెలిసింది. మరోవైపు ముయిజ్జుతో సమావేశమైనట్లు జైశంకర్ ఎక్స్ వేదికగా తెలిపారు. ‘ఈ రోజు న్యూ ఢిల్లీలో మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొమహ్మద్ ముయిజ్జును కలుసుకోవడం ఆనందంగా ఉంది. మాల్దీవులతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాము’ అంటూ ట్వీట్ చేశారు.