పర్యాటక భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉద్యోగుల హాజరు పట్టిక, బయో మెట్రిక్లో అటెండెన్స్ను పరిశీలించారు. ఆఫీస్ టైమింగ్స్ పాటించకపోవడం, హాజరు శాతం తక్కువగా ఉండటంతో సిబ్బందిపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు శాతం, ఉద్యోగులు పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానని ఆయన చెప్పారు.