నీట్ విషయంలో ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శించారు. బీహార్, గుజరాత్, హర్యానాలలో అరెస్టులు జరిగాయని, బీజేపీ పాలిత రాష్ట్రాలు పేపర్ లీకేజీలకు కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు మారిపోతుంటే మోదీ మాత్రం ఎప్పటిలాగే మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. పేపర్ లీకేజీలపై కఠిన చట్టాలను రూపొందించేందుకు తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని చెప్పారు.