బెంగళూరులోని దర్శన్కు చెందిన ఫామ్ హౌస్లో అతని మేనేజర్ శ్రీధర్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్పై పలు ఆరోపణలు రాగా.. ప్రస్తుతం ఆయన మేనేజర్ సైతం ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు దర్యాప్తు బాగంగా పోలీసులు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్తో పాటు వీడియో సందేశాన్ని గుర్తించారు. అందులో 'తన చావుకు ఎవరూ కారణం కాదని.. ఒంటరితనం వేధించడంతో తాను చనిపోవాలని నిర్ణయించుకున్న'అని ఉందని తెలిపారు.