బిలియనీర్ క్యాపిటల్ ఆఫ్ ఏషియా’గా అవతరించింది భారత వాణిజ్య రాజధాని ముంబై. చైనా రాజధాని బీజింగ్ని వెనక్కి నెట్టి, ఈ జాబితాలో.. తొలిసారిగా మొదటి స్థానానికి చేరింది. హురున్ రీసెర్చ్ 2024 గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం.. ముంబైలో 92 మంది బిలియనీర్లు ఉండగా, బీజింగ్లో ఆ నెంబర్ 91గా ఉంది. ఇక భారత్లో 271 మంది బిలియనీర్లు ఉన్నారు. కానీ చైనాలో ఈ నెంబర్ 814గా ఉంది.