సింగపూర్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కొవిడ్ కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో కొత్త వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం వారంరోజుల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ర్యాండమ్గా శాంపిల్స్ తీసుకుని సర్వే చేపట్టనున్నారు. ఈ కొవిడ్ కారణంగా ఎలాంటి ప్రమాదం లేదని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.