ఏపీ సీఎం జగన్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం జగన్ ఇప్పటి వరకు కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కూర్చుని పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని.. అలాంటిది ఆయన కనీసం కలవకపోవడం ఏంటో అర్థం కాలేదన్నారు. రాజకీయంగా తప్ప.. పర్సనల్గా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.